అనంతపురం

ఎర్రచందనం దుంగల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 7: మండలంలోని దయ్యాలకుంటపల్లి మీదుగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగలను బుక్కరాయసముద్రం పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. ట్రాక్టర్, బొలోరా జీపు, ద్విచక్ర వాహనంలలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో బుక్కరాయసముద్రం పోలీసులు దాడి చేసి 7మందిని అదుపులోకి తీసుకొని వారితోపాటు ట్రాక్టర్, బొలోరా, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 21 ఎర్రచందనం దుంగల విలువ రూ.5 లక్షలు ఉండవచ్చునని అన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు, నార్పల మండలంకు చెందిన ఒకరు, శింగనమల మండలంకు చెందిన ఒకరు, బుక్కరాయసముద్రం మండలంకు చెందిన ఒకరు ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.