అనంతపురం

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, ఏప్రిల్ 7 : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన బుడుగ జంగమ మంజునాథ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీ్ధర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాల మేరకు ఇందిరమ్మ కాలనీకి చెందిన మంజునాథ్‌కు తాగుడుకు బానిసయ్యాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరచూ ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం గొడవపడి ఇల్లు వదలి వెళ్లిపోయాడన్నారు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అయితే చోళసముద్రం గ్రామ సమీపంలో ఓ పాడుబడ్డ బావిలో దుర్వాసన వెదజల్లుతున్న విషయాన్ని గమినించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై శ్రీ్ధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మంజునాథ్ శవంగా గుర్తించారు. మృతదేహం కాళ్లు, చేతులు కట్టి వేయబడి ఉన్నాయన్నారు. శవాన్ని గుర్తించడానికి వీలులేకుండా ఉబ్బిపోయిందన్నారు. తర్వాత రూరల్ సిఐ రాజగోపాల్‌నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్యకు గురయ్యాడా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.