అనంతపురం

బావిలో పడి యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 12: మండల పరిధిలోని కోతులగుట్టకు చెందిన జ్యోతి (18) మంగళవారం సాయంత్రం బావిలో పడి మృతి చెందింది. జ్యోతి వరి పొలం కోసేందుకు కూలి పనులకు వెళ్ళింది. సాయంత్రం 4 గంటల సమయంలో చింతచెట్టులో ఉన్న తేనె తొట్టెకు కొందరు రాళ్లు విసరడంతో తేనెటీగలు కూలీలపై దాడి చేశాయి. దీంతో వాటి బారి నుండి తప్పించుకొనేందుకు పరుగులు తీసిన జ్యోతి రహదారి ప్రక్కనే ఉన్న బావిలోకి పడిపోయింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. అయితే ఆమెను రక్షించే వారు ఎవరూ లేకపోవడంతో మృతి చెందింది. చివరకు గుర్తించిన పశువుల కాపర్లు కుటుంబ సభ్యులకు తెలియచేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మక్బూల్ బాషా సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నార