అనంతపురం

ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 15 : శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని మెట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్త జన సందోహం నడుమ కల్యాణోత్సవం జరిపించారు. ఉదయ ం 8 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. అదేవిధంగా పట్టణంలోని కోట వెంకటరమణస్వామి, షిరిడీ సాయిబాబా, కన్యకా పరమేశ్వరి, చంద్రవౌళేశ్వరస్వామి, ముత్యాలమ్మ, కనుమ మారెమ్మ, కల్లుమర్రి వీరకేతమ్మ, భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట, చందకచర్ల ఆంజనేయస్వామి, మెళవాయి చౌడేశ్వరి, గంగపూజమ్మ, మూలకంఠేశ్వరస్వామి, కొల్లాపురమ్మ తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠాపురంలో వెలసిన నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కోదండరామస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పలువురు భక్తులు పాల్గొన్నారు. అన్ని ఆలయాల్లో భక్తులకు పానకం పంపిణీ చేశారు. మెట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు.