అనంతపురం

ఆదర్శప్రాయుడు జవహర్‌లాల్ నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 27: స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించిన జవహర్‌లాల్ నెహ్రూ ఆదర్శప్రాయుడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని విగ్రహానికి రఘువీరా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ, స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యంగా పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలన్నారు.