అనంతపురం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 24: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, సెర్ఫ్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మినీ ట్రాక్టర్ కొరకు సబ్సిడీపై మంజూరైన లక్ష రూపాయల చెక్కును సోమవారం లబ్దిదారునికి అందజేశారు. ఈ సదంర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతన్నల కోసం ప్రభుత్వం సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలు, అధునాతనమైన వ్యవసాయ పనిముట్లను అందజేస్తోందని తెలిపారు. దీంతో రైతులు అధిక దిగుబడులను తీసుకుని, ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. ఆత్మకూరు మండలం బి.యాలేరుకు చెందిన రామాంజినేయులకు మంత్రి చేతులు మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేసారు.