అనంతపురం

మహిళలను గౌరవించేది తెదేపానే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జనవరి 16: మహిళలను గౌరవించేది తెలుగుదేశం పార్టీయేనని, సీఎం చంద్రబాబునాయుడు మహిళల పట్ల ఎప్పుడూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని, వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం రామగిరిలోని అతిథి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో షర్మిలపై ఎవరో అసభ్యకర పోస్ట్‌లు పెడితే వాటిని తెదేపాకు, సీఎం చంద్రబాబుపై రుద్దడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా పోరాడుదాం కాని వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ వివాహాలపై విమర్శలు చేసి మహిళలను చులకన చేయలేదా అంటూ ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఈ నెల 18న రాప్తాడులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తెలుగు యువత ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి మంత్రి విశే్లషించారు.