అనంతపురం

అర ఎకరం కోసం దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, మే 30: బుక్కరాయసముద్రం మండల కేం ద్రంలో సోమవారం ఉదయం బస న్న(65)ని అర ఎకరం పొలం కోసం అన్న కొడుకు అయిన బండి వెంకటేషులు దారుణంగా కొడవలితో నరికి చంపాడు. స్థానికులు, ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాధ్‌యాదవ్, బుక్కరాయసముద్రం ఇన్‌ఛార్జ్ ఎస్సై శివలు తెలిపిన వివరాల మేరకు బసన్న, నిందితుడి తండ్రి ఓబిలేసు ఇరువురు అన్నదమ్ములని, వీరికి బుక్కరాయసముద్రం 376 సర్వే నెంబర్‌లో 8 ఎకరాల 20 సెంట్లు పొలం ఉందన్నారు. అన్నదమ్ములిరువురు భాగ పరిష్కారాల సమయంలో బసన్న 4 ఎకరాల 60 సెంట్లు, అతని అన్న ఓబిలేసు పేరిట 3 ఎకరాల 60 సెంట్లు భాగ పరిష్కారం జరిగిందన్నారు. అయితే ఓబిలేసు మృతి చెం దిన తరువాత అతని కుమారుడు వెంకటేషు నీకు ఎలా అర ఎకరం పొలం ఎక్కువ వస్తుందని తన చిన్నానతో గొడవ పడేవాడని, గత 3 సంవత్సరాల క్రితం వెంకటేషు తన భా గాన్ని అమ్ముకోగా సర్వే సమయంలో తనకు ఇంకా అర ఎకరం పొలం రావాలని వాదనకు దిగి పోలీస్ స్టేషన్‌లలో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చే సుకున్నారు. అయితే ఆదివారం వర్షం బాగా కురవడంతో వెంకటేషు ట్రాక్టర్ తీసుకువెళ్ళి వ్యవసాయం చేయిస్తుండగా బసన్న అడ్డుకొని గొడవపడ్డారు. గొడవ పెద్దదై వెంకటేషు తన చిన్నానపై కొడవలితో దాడి చేసి నరకడంతో బసన్న అక్కడికక్కడే నేలకొరిగాడు. నిందితుడు వెంకటేషు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.. విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం ఇన్‌ఛార్జ్ ఎస్సై శివ, ఎఎస్సైలు, సిబ్బందితో సంఘటనా స్థలంకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. కేసును బుక్కరాయసముద్రం పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.