అనంతపురం

రోడ్డు ప్రమాదంలో ఎంపిఇఓ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుర్పి, జూన్ 3 : మండల పరిధిలోని కర్నాటక సరిహద్దులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసాపురం ఎంపిఇఓ లక్ష్మీనారాయణ(36) మృతి చెందాడు. బంధువులు, మిత్రులు తెలిపిన వివరాల మేరకు కుందుర్పి మండలంలో ఎంపిఇఓలుగా పనిచేస్తున్న రవి, రఘుతో కలిసి లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కుందుర్పి నుంచి నాగేపల్లి గేటుకు వెళ్తుండగా నాగేపల్లి, శిగలపల్లి మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో లక్ష్మీనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. రఘు, రవికి తీవ్ర గాయలు కావడంతో స్థానికులు కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెళికెర ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి పరశురాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు హిందూపురం సమీపంలోని పరిగి మండలంలోని ఆనందపాలెంకు చెందిన వ్యక్తి. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి చెందడంపై పలువురు ఉద్యోగులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.