అనంతపురం

ఆత్మకూరు జంటహత్యల కేసు ఛేదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 3:జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలో జరిగిన జంట హత్యల కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. జంట హత్యలకు సంబందించిన వివరాలను అనంతపురం డియస్పీ మల్లికార్జున వర్మ డియస్పీ కార్యాలయంలో విలేఖర్లకు వెల్లడించారు. డబ్బును రెండింతలు చేస్తామనే ఆశా చూపి డబ్బును కాజేసేందుకు హత్యలు చేశారని తెలిపారు. ఆత్మకూరుకు చెందిన ఏకిల సతీష్(38), జంగం బసవరాజు(33)లను మే 20న స్థానికంగా హత్య చేసిన కేసులో నిందితులైన కర్నాటక పావగడలోని అచ్చెమహళ్ళి రామప్పకుమారులు మల్లయ్య అలియాస్ పేకాట మల్లయ్య, సారాయి నారాయణప్ప అలియాస్ బెస్త శివప్రకాష్‌లను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి నుండి రూ.2లక్షల రూపాయల నగదును, 3.5 తులాల బంగారంను, రెండు సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.