అనంతపురం

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జూన్ 7: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గ్రామస్థాయిలోని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని హోటల్ టూరిజం నందు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఎన్‌టి.చౌదరి ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో బిజెపి పల్లె పల్లెకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. 2020నాటికి వ్యవసాయం ద్వారా ఆదాయం రెండింతలుగా పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కిసాన్ సంచాయ్ యోజన పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రూ.50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి తగిన ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. ఎన్‌టి.చౌదరి మాట్లాడుతూ కేంద్ర వేర్ గృహ నిర్మాణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చౌదరిని సన్మానించారు. ఈ సమావేశంలో నాయకులు కొండమరాజు, కత్తి రాజారెడ్డి, జ్యోతి ప్రసాద్, ఊట్ల సోము పాల్గొన్నారు.