అనంతపురం
కేంద్రాన్ని విమర్శించడం కెసిఆర్కు తగదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 July 2016
పెనుకొండ, జూలై 1 : హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని ఎంపి నిమ్మల కిష్టప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశం సున్నితమైన విషయమని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అంశం లేదన్నారు. శాఖల విభజన దశలవారీగా జరుగుతుందన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా కెసిఆర్ అనాలోచితంగా వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న ఆంధ్రా న్యాయమూర్తులను వెనక్కు పంపుతామని చెప్పడం సమంజసం కాదన్నారు.