అనంతపురం

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, జూ లై 15 : మండల పరిధిలోని రే కులకుంట, దయ్యాలకుంటపల్లి గ్రామాల పరిసరాలలో ఉన్న కొండ ప్రాంతంలో ఓవ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయంపై బుక్కరాయమసముద్రం ఎఎస్‌ఐ జనార్ధన్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన ఉమానగర్ నివాసి బండి ఓబులేసు(57) అనే వ్యక్తి తన ఇంటిలో నుండి ఈనెల 13న మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెల్లాడని అదే రోజు రాత్రి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో జిల్లా ఉన్నతాధికారుల నుండి వచ్చిన సమాచారం మేరకు బుక్కరాయసముద్రం మండలంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించగా శుక్రవారం ఉదయం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో ఉన్న కొండల్లో ఓవ్యక్తి శవం ఉన్నట్లు స్థానికుల ద్వార సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించారు. అయితే మృతుడు ఓబులేసు తన చొక్క జేబులో సుసైడ్ నోట్ రాసి ఉంచుకుని మరి పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ జనార్దన్ తెలిపారు. శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.