అనంతపురం
రైల్వే కోర్టుకు హాజరైన టిడిపి నేతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 July 2016
గుంతకల్లురూరల్, జూలై 28 : 2013లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన కేసులో మంత్రి పల్లె రఘునాథ్రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు గురువారం గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరయ్యారు. అప్పట్లో అనంతపురం, హిందూపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో జరిగిన రైలురోకోకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణంలో భాగంగా మంత్రితోపాటు చీఫ్విఫ్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, బికె పార్థసారధి, వరదాపురం సూర్యనారాయణ, టిడిపి నాయకులు బుగ్గయ్య చౌదరి, ప్రకాశ్నాయుడు, మాజీ టిడిపి నేత మహాలక్ష్మి శ్రీనివాస్ కోర్టుకు హాజరయ్యారు.