అనంతపురం

టిడిపి హయాంలోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 31: మండల పరిధిలోని తోపుదుర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.6 లక్షల 50 వేలతో నిర్మించిన అదనపు గదిని మంత్రి పరిటాల సునీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్‌లు ఆదివారం ప్రారంభించారు. తోపుదుర్తి గ్రామ ప్రజలు మంగళవాయిద్యాలతో మంత్రి పరిటాల సునీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్ ఇతర ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తోపుదుర్తి పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదుల కొరత ఉన్నందున అదనపు గదిని నిర్మింపజేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, తల్లిదండ్రులు కూడా మీ పిలల్ల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మాజీ సర్పంచ్ తోపుదుర్తి గోపాల్ మంత్రిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మారెక్క, స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.