అనంతపురం

చిరుత దాడి.. 38 గొర్రె పిల్లలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, ఆగస్టు 7: చిరుత దాడిలో 38 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గువ్వలగొందిపల్లి గ్రామంలో శివయ్య పొలం వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు నంజమ్మ, చండ్రాయుడులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. గొర్రెలను మేపుకు తీసుకెళ్ళామని, వాటి పిల్లలను ఒకచోట చేర్చి చుట్టూ కంచె వేశామన్నారు. అయితే వున్నపళంగా శనివారం రాత్రి గొర్రె పిల్లల మందపై చిరుత దాడి చేసింది. ఇందులో 38 గొర్రె పిల్లలు మృతి చెందాయి. కొండ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల చిరుత సంచారాలు అధికంగా వున్నాయన్నారు. 38 గొర్రె పిల్లల విలువ దాదాపు రూ.1లక్ష దాకా వుంటుందని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని రామగిరి బీట్ ఆఫీసర్ ఆంజనేయులు పరిశీలించారు. ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందేలా చూడాలని బాధితులు, గ్రామస్థులు కోరుతున్నారు.