జాతీయ వార్తలు

జాతీయ స్థాయి నేతలతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. ఆయన నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్వాగతం పలికారు. శరద్‌పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై జరుగుతున్న ఐటీ దాడులు, రాజకీయ కక్షసాధింపు వంటి చర్యలపై చర్చించారు. అనంతరం ఈ ముగ్గురు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. భవిష్యత్తు తరలా సంక్షేమం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ యేతర పార్టీలన్నింటినీ కూడగడతామని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.