జాతీయ వార్తలు

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు నేడు భారీ భద్రత నడుమ ప్రారంభమయ్యాయి. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు ఈనెల 14న జరగనుంది. 261 జిల్లా పరిషత్‌లు, 6,157 పంచాయతీ సమితులు, 31,827 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.