జాతీయ వార్తలు
భుజ్బల్కు బెయిల్.. అయినా జైలే గతి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 June 2016
ముంబయి: మహారాష్ట్ర సదన్ కుంభకోణం కేసులో ఎన్సిపి నేత, మాజీ మంత్రి ఛగన్ భుజ్బల్కు, ఆయన మేనల్లుడు సమీర్లకు ఇక్కడి ఎసిబి ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, మరికొన్ని పెండింగ్ కేసుల వల్ల వారు జైలు నుంచి విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఏభై వేల రూపాయల పూచీకత్తుపై భుజ్బల్, సమీర్లకు ఎసిబి కోర్టు బెయిల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మహారాష్ట్ర సదన్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు భుజ్బల్పై కేసు నమోదైంది. మనీల్యాండరింగ్కు సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంటు విభాగం (ఈడి) కేసు పెట్టింది.