జాతీయ వార్తలు
కేజ్రీవాల్ ఇంటివద్ద బిజెపి ఎంపీ నిరాహార దీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
దిల్లీ: ఎన్ఎండిసి అధికారి ఖాన్ హత్యలో తన ప్రమేయం ఉందటూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించినందుకు నిరసనగా బిజెపి ఎంపీ మహేష్ గిరి సోమవారం ఉదయం ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. మహేష్ గిరిని అరెస్టు చేసి విచారణ చేయాలని కేజ్రీవాల్ సోమవారం ‘ట్వీట్’ చేశారు. ఖాన్ హత్యకేసులో బిజెపి ఎంపీ గిరితో పాటు ఎన్ఎండిసి వైస్ చైర్మన్ కరణిజిత్ తన్వర్ను కాపాడేందుకు దిల్లీ గవర్నర్ జంగ్, ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కేజ్రీ ఆరోపించారు. దమ్ముంటే తనపై ఆరోపణలను కేజ్రీవాల్ నిరూపించాని మహేష్గిరి సవాల్ చేస్తున్నారు.