జాతీయ వార్తలు

బస్సులో ప్రయాణించిన కేరళ మాజీ సీఎం చాందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ కొల్లం నుండి తిరువనంతపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత బస్సులో ప్రయాణిస్తున్నానని చాందీ తెలిపారు. తనకు బస్సులో ప్రయాణించడమంటే ఎంతో ఇష్టమని కానీ ముఖ్యమంత్రి పదవి వల్ల అది కుదర్లేదన్నారు. కారులో వెళ్లే అవకాశం ఉన్నా తిరస్కరించి బస్సులో వెళ్లారు. బస్సులో ఆయనతో పాటు 25 మంది ప్రయాణికులు ఉన్నారని వారంతా చాందీతో మాట్లాడి సెల్ఫీలు తీసుకున్నారని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.