చిత్తూరు

జిల్లాలో భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 7 : జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధజైన్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రాజెక్టులు నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడానికి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌లతో పాటు మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లకు భూసేకరణ వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు పనులు సరిగా చేయని కాంట్రాక్ట్ పనులను అవసరమైతే రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగు, సాగునీరు అందించేందకు చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి భరత్‌గుప్తా, డిఆర్‌వో విజయచందర్, తిరుపతి, మదనపల్లి సబ్ కలెక్టర్లు హిమాంషుశుక్లా, కృతికాబాత్రా, ఇతర ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.