జాతీయ వార్తలు

మోదీ సమీక్షకు అఖిలేష్ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: యుపిలో నీటికొరతను నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి యుపి సిఎం అఖిలేష్ యాదవ్ హాజరు కావడం చర్చనీయాంశమైంది. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న యుపికి ఇటీవల కేంద్రం నీటిరైలును పంపగా యుపి సర్కారు తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిలేష్ హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్న యుపి, కర్నాటక, మహారాష్టల్ల్రో పరిస్థితిని చక్కదిద్దేందుకు మోదీ దిల్లీలో సమావేశాలను ఏర్పాటు చేసి సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. నీటిరైలును తిప్పిపంపిన అఖిలేష్ ఈరోజు ప్రధానిని కలవడం వెనుక మతలబు ఏంటా? అని రాజకీయ విశే్లషకులు ఆలోచనలో పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అఖిలేష్ మోదీని కలిశారని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.