చిత్తూరు

పంట పొలాలపై ఏనుగుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, జూన్ 7: మండల పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల పంట పొలాలపై సోమవారం రాత్రి ఏనుగులు దాడులకు పాల్పడ్డాయి. మద్దిమాకులపల్లె సమీపంలోని పంటలపై నాలుగు ఏనుగులు దాడులకు పాల్పడి క్యాబేజీ, టమోటా, బీన్స్, మిరప పంటలను తిని తొక్కి నష్టపరిచాయి. అదేవిధంగా గోనుమాకులపల్లె సమీపంలో రెండు ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో, ధరలు ఆశాజనకంగా ఉన్నప్పుడు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వి.కోటకు వచ్చిన డిఎఫ్‌వో చక్రపాణినాయుడు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం సత్వరం అందిస్తామని హామీ ఇచ్చారు.