చిత్తూరు

తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 7: తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి మంగళవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక లీలామహల్ జంక్షన్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం డిస్చార్జ్ అయ్యారు. సాయంత్రం హఠాత్తుగా తీవ్ర ఇబ్బందికి గురైన ఆయన చికిత్స కోసం వెళ్లారు. ఆసయమంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రిలోనే కన్నుమూశారు. విషయం తెలుసుకుని తిరుపతి ఎస్పీతోపాటు పలువురు పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. కాగా తిరుపతిని అర్బన్ జిల్లాగా ప్రకటించిన తరువాత తిరుపతి క్రైం సర్కిల్‌కు ఏఎస్పీగా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వృత్తిలో నిజాయితీపరుడిగాను, నిబద్ధతత కలిగిన వ్యక్తిగాను మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.