చిత్తూరు

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు, జూన్ 10: మండల కేంద్రంలోని తూగుండ్రం రోడ్డు వద్ద శుక్రవారం ఆగివున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో వినోద్‌కుమార్(20) అనే యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన జరిగింది. స్థానిక ఎస్సై విశ్వనాథరెడ్డి కథనం మేరకు వేపంజేరి నుంచి చిత్తూరు వైపు ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి గ్రానైట్ రాయిని తరలిస్తున్న లారీ ఢీకొనడంతో వేపంజేరి దళిత వాడకు చెందిన హరి కుమారుడు వినోద్‌కుమార్(20) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ప్రమీల(22), బాలకృష్ణ(19), సురేంద్రకుమార్ (20)లకు గాయాలైయ్యాయన్నారు. ఈమేరకు గంగాధర నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి వినోద్‌కుమార్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.