జాతీయ వార్తలు
ప్రభుత్వ విధులకు ఎల్జీ ఆటంకంగా మారోద్దు:సుప్రీంకోర్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 July 2018
న్యూఢిల్లీ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని, ప్రభుత్వ విధులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకంగా మారవద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. గత కొంతకాలంగా వివాదంగా మారిన ఢిల్లీ పరిపాలన అధికారాలపై బుధవారంనాడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవని, మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని ఆ తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.