జాతీయ వార్తలు

నవాజ్ షరీఫ్ ఇంటికి మోదీ వెళ్లొచ్చా?: దిగ్విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్లి రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వెళితే తప్పులేదు గానీ, పాక్ ప్రజలను తమ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి రమ్య మెచ్చుకుంటే తప్పేముందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు. సార్క్ సదస్సు సందర్భంగా ఇటీవల రమ్య పాకిస్థాన్ వెళ్లినపుడు అక్కడి ప్రజలు మంచివారేనని అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ నరకం లాంటిదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విమర్శించిన నేపథ్యంలో రమ్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు దుమారం రేపుతున్నాయి. ఆమెపై దేశద్రోహం నేరం కింద కర్నాటక కోర్టులో కేసు నమోదైంది. దీంతో దిగ్విజయ్ ట్విట్టర్‌లో ఘాటైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రజలు మంచివారని అంటే అది దేశద్రోహం కిందకు వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.