తూర్పుగోదావరి

ప్రభుత్వ భూములు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, జూన్ 10: ప్రభుత్వ భూముల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలోని కాటవరం గ్రామ పంచాయతీ పరిధిలోగల కొండను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పరిశీలించారు. ఆ కొండ 96 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఆ భూమిని ప్రభుత్వం అవసరం వచ్చిన సమయంలో ఉపయోగించుకోవచ్చునని జెసి తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వేలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినట్టు జెసి తెలిపారు. ఈ సందర్భంగా ఆ సమీపంలోనే పనిచేస్తున్న ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేస్తున్న కూలీలకు సక్రమంగా సొమ్ములు అందుతున్నాయోలేదో అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలే పనిచేస్తున్నారేమిటని ఎపిఒను జెసి ప్రశ్నించారు. జెసి వెంట తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఉపాధి హామీ ఎపిఒ సురేష్ తదితర అధికారులు ఉన్నారు.