తూర్పుగోదావరి

ముద్రగడకు మద్దతుగా సెల్‌టవర్ ఎక్కిన యువకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడికుదురు, జూన్ 10: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని ఉద్యమం సందర్భంగా ముద్రగడ అభిమానులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యువకులు శుక్రవారం నగరంలో సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే కిందకు దిగుతామని హంగామా సృష్టించారు. దీంతో రాజోలు సిఐ జివి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా అక్కడకి చేరుకున్న వందలాది మంది ముద్రగడ అభిమానులు డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. డిమాండ్లను ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళతానని పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళనకారులు వానరాశి ప్రసాద్, గిడుగు సురేష్ టవర్ దిగివచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ముద్రగడ అభిమానులు కూనపురెడ్డి రాంబాబు, తోట పెద్దిరాజు, కొమ్ముల జంగమయ్య, పి కాశి తదితరులు అందోళనకారులకు నచ్చచెప్పారు.