జాతీయ వార్తలు
నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 October 2018
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలకు డిసెంబర్ 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపి రావత్ వెల్లడించారు. ఇవాల్టి నుంచి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు.
చత్తీస్గఢ్కు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే నెలలో 16, 20 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరుగుతాయి.
మధ్యప్రదేశ్కు 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేనెల 28న ఒకదశలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.