గుంటూరు

భర్త చేతిలో నవ వధువు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 9: వివాహమై పట్టుమని రెండు నెలలు పూర్తి కాకుండానే ఒక నవ వధువు భర్త చేతిలో హత్యకు గురైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన జిడుగు రాణికి పెనుగంచిప్రోలుకు చెందిన వెంకట నారాయణ (21)తో ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం జరిగింది. బుధవారం భార్య రాణితో కలిసి వెంకట నారాయణ మేళ్లచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7గంటల ప్రాంతంలో అక్కడ నుండి బయలుదేరగా పట్టణ సమీపంలోని పద్మావతినగర్ వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిందని, ఈ నేపధ్యంలో అక్కడ ఇరువురికి మాటామాటా పెరగడంతో భర్త వెంకట నారాయణ రాణి మెడలోని చున్నీతో ఉరి వేసి చంపినట్లు తెలిపారు. కాగా యాక్సిడెంట్‌లో గాయపడి రాణి మృతి చెందినట్లు భర్త నమ్మించే ప్రయత్నం చేసినా రాణి మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానించిన పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. సిఐ లచ్చునాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.