జాతీయ వార్తలు

కేంద్రమంత్రి హేగ్డే ఆరోపణలపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తనను చంపటానికి కుట్ర చేశారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే చేసిన ఆరోపణలపై కర్నాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. కర్ణాటకలో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే కాన్వాయ్‌లోని వాహనాన్ని మంగళవారం రాత్రి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొన్న విషయం విదితమే. దీనిపై హేగ్డే స్పందిస్తూ తనను చంపటానికి కుట్ర చేశారని, ఆ ప్రయత్నం విఫలమైందని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. ట్రక్కు డ్రైవర్ కావాలనే వేగంగా వచ్చి తన వాహనాన్ని ఢీకొట్టారని, కాని తన వాహనం వెళ్లిపోవటంతో తృటిలో ప్రమాదం తప్పిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కాగా కేంద్రమంత్రి ఆరోపణలపై కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.