హైదరాబాద్
బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖైరతాబాద్, జూన్ 2: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్లో నివసించే రాజేష్ (38) హైదర్గూడలోని పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో బంజారాహిల్స్ వైపు నుంచి సూర్య, విష్ణు, షవేల్, అశ్విన్, సాయి రాజేష్, జోసఫ్లు మద్యం సేవించి మితిమీరిన వేగంతో కారులో ప్రయాణిస్తున్నారు. వీరి కారు పంజాగుట్ట హిందూ శ్మశానవాటిక వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునుంచి ప్రయాణిస్తున్న రాజేష్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ మృతిచెందగా అతని కుమార్తె రమ్య తీవ్రగాయాలపాలైంది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన యువకులను బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా నగరంలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా బంజారాహిల్స్ రోడ్నెంబర్ 3లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విచారణ వేగవంతంగా పూర్తిచేసిన పోలీసులు వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.