హైదరాబాద్

పాతబస్తీలో పర్యటించిన జలమండలి ఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: నగరంలో చేపడుతున్న మెట్రోరైలు పనుల్లో భాగంగా నీటి సరఫరాకు సంబంధించి పాతబస్తీలో చేపడుతున్న 1200 డయ పిఎస్‌సి పైప్‌లైన్ షిఫ్టింగ్ నిర్మాణ పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ గురువారం తనిఖీ చేశారు. సంతోష్‌నగర్‌లోని ఓవైసీ జంక్షన్, డిఆర్‌డిఓ క్రాస్ రోడ్డులో జలమండలి ట్రాన్స్‌మిషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. డివిజన్-2 పరిధిలోని ఈదీబజార్, రియసత్‌నగర్‌లో కలుషిత నీటి సరఫరా అవుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేసి వెంటనే పనులు పూర్తి చేసి స్వచ్చమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎండి అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో ఎండితో పాటు జలమండలి డిటి డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, సిజిఎంలు బి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎ.రవి పాల్గొన్నారు.