హైదరాబాద్

సిరిమువ్వలు పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 12: తెలుగు సాహిత్య కళా పీఠం కార్యనిర్వాహక అధ్యక్షులు ఈటెల సమ్మన్న రచించిన సిరి మువ్వలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార బాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందరిని సంతృప్తి పరిచే విధంగా కవిత్వాలను ఎవరూ రాయలేరు. అందులోనూ సమకాలిన రచయితలను మెప్పించడం కత్తిమీద సాములాంటిదని చెప్పారు. పాఠకుల అభిరుచిని బట్టీ ఆయా కవితలకు ప్రాదాన్యత పెరుగుతందని అన్నారు. కళాపీఠం కార్యనిర్వాహక అధ్యక్షులుగా కొనసాగుతున్న ఈటెల సమ్మన్న రచించిన సరి మువ్వలు అందర్ని ఆకట్టుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్. వెంకట నారాయణ, పత్తిపాక మోహన్, చిక్కా రామదాసు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.