హైదరాబాద్

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, నవంబర్ 6: కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మఠాధిపతులు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, మంగళశాసనాలతో నగర ప్రజలు పునీతులయ్యారు. పరమపూజ్య, పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి షష్టిపూర్తి మహోత్సవం ఆదివారాం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా చినజీయర్‌స్వామి జీవిత చరిత్రతో కూడిన పుస్తకాన్ని గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. అలాగే ఎన్టీఆర్ సేడియంలో రెండ్రోజులుగా కొనసాగుతున్న భక్తి టీవి కోటిదీపోత్సవం కార్యక్రమానికి కూడా చిన్నజీయర్ స్వామి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. షష్టిపూర్తి మహోత్సవం, కోటిదీపోత్సవం పురస్కరించుకుని నిర్వాహకులు స్వామివారికి పాదపూజ, నదీజలాలలతో అభిషేకం, పుష్పార్చన నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా జరుగుతున్న కోటిదీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి.