హైదరాబాద్

కేంద్రం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, మే 24: ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతపార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినాయకులు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోని బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా బుధవారం మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. నాలుగున్నర గంటలకు క్రిస్టల్ గార్డెన్స్ చేరుకోవల్సిన అమిత్‌షా కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్నా, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన కోసం ఎదురుచూశారు. వేదికపై ప్రసంగాన్ని ప్రారంభించగానే గతంలో కూడా తాను హైదరాబాద్‌కు వస్తానని చెప్పినా, రాలేకపోయినందుకు క్షమించాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన బిజెపి నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మున్ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలను నాయకులు వివరించారు.
మోదీ అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లాలంటూ, మజ్లిస్‌కు వ్యతిరేకంగా నాయకులు చేసిన ప్రసంగానికి కార్యకర్తలు కేరింతలు కొట్టారు. బిజెపి, నరేంద్రమోదీ, అమిత్‌షాలకు అనుకూలంగా కార్యకర్తలు చేసిన నినాదాలతో ఫంక్షన్ హాల్ మార్మోగింది. నాయకులు, కార్యకర్తలంటూ విభేదాల్లేకుండా సమష్టి కృషితో ముందుకెళితే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవటం ఖాయమని నగర బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలు ధనుస్సును బహూకరించారు.