హైదరాబాద్

‘సినారె వైభవం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 23: ప్రముఖ రచయిత ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘సినారె వైభవం’, ‘ప్రవర నిర్వేదం’ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ యువ కళావాహిని ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు సినారె చిరస్థాయిగా నిలచి ఉంటారని పేర్కొన్నారు. సినారె జీవిత చరిత్రపై భూమయ్య లోతైన అధ్యాయనం చేశారని తెలిపారు. సంప్రదాయ, అధునిక కవిత్వలను భూమయ్య రచించారని కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త డా.పాలకుర్తి మధుసూదన రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ రావ223ష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య, రచయిత్రి కేబీ లక్ష్మీ, సంస్థ అధ్యక్షుడు వైకే నాగేశ్వర రావు పాల్గొన్నారు.