హైదరాబాద్

రెండు ముక్కలే ముద్దు.. మూడు ముక్కలు వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి నివేదికలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పునర్విభజన అధ్యయన కమిటీ పార్టీ పరిశీలకుడు పర్యాద కృష్ణమూర్తి, మంత్రి మహేందర్‌రెడ్డితో కూడిన అధ్యయన కమిటీ పార్టీ వర్గాలతో చర్చించి సమస్యలను పరిగణనలోకి తీసుకుని జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నివేదిక రూపొందించింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను రెండు జిల్లాలుగా విభజిస్తే ఎలాంటి సమస్య ఉండదని అధ్యయన కమిటీ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం ఉన్న జిల్లాను రెండుకు మించి భాగాలు చేయరాదని అనివార్య పరిస్థితుల్లో మూడుగా విభజిస్తే మేడ్చల్ నియోజకవర్గంలోని కొంతభాగంతో పాటు మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బి నగర్, ఇబ్రహీమ్‌పట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిని మూడవ జిల్లాగా విభజించవచ్చనే సమాచారంతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. చేవెళ్ల, మల్కాజ్‌గిరి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను రెండు జిల్లాలుగా విభజించాలని లేకుంటే వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీమ్‌పట్నం జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలని పలువురు కమిటీ దృష్టికి తీసుకురాగా, అనివార్యమైతే మూడుగా విభజించవచ్చని అధ్యయన కమిటీ నివేదిక సమర్పించింది.