హైదరాబాద్

ఐడిఎల్ కాలనీలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో లబ్ధిదారుల మధ్య చిచ్చు మొదలైంది. బన్సీలాల్‌పేటలోని ఐడిఎల్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో 86 ఇళ్లను శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లాటరీ పద్ధతి ద్వారా ద్వారా కేటాయించేందుకు వచ్చారు. ఇందులో భాగంగా 86 ఇళ్లను అమ్ముగూడ వాసులకు లాటరీ పద్దతి ద్వారా మంత్రి కేటాయించారు. ఇందులో అర్హులైన పనె్నండు మందికి ఇళ్లు కేటాయించలేదంటూ కొందరు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ఇళ్ల కేటాయింపులో అలజడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రిని ఘెరావ్ చేసేందుకు యత్నించగా, పోలీసులురంగప్రవేశం చేసి చెల్లాచెదురు చేశారు.