జాతీయ వార్తలు

చైనాలో బస్సుకు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, డిసెంబర్ 5: చైనా వాయువ్య ప్రాంతంలో మంగళవారం ఒక ఉన్మాది బస్సును దగ్ధం చేయడంతో 17 మంది మృతిచెందగా, మరో 32 మంది గాయపడ్డారు. హెలన్ రాష్ట్రంలోని ఇంచువాన్ నగరంలో ఫర్నీచర్ మాల్ సమీపాన సోమవారం ఉదయం దాదాపు 7 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ బస్సుకు నిప్పంటించినట్టుగా అనుమానిస్తున్న మయోంగ్‌పింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు బస్సుల్లో పెట్రోలు పోసి నిప్పటించిన ఘటనలు చైనాలో ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. ప్రస్తుత ఘటనలో మృతిచెందిన వారిలో ఎనిమిది మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన 32 మంది 20 నుంచి 65 ఏళ్లలోపువారే. నింగ్జియా హుయి రాజధాని ఇంచువాన్‌లోని నింగ్జియా మెడికల్ యూనివర్శిటీ వైద్యశాలలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి డిప్యుటీ ప్రెసిడెండ్ జియా షావోబింగ్ చెప్పారు.