జాతీయ వార్తలు

ఐదుగురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేయడానికి నిర్వహించిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు శనివారం అయిదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా చౌకిబల్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మిలిటెంట్ల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని సైనికాధికారి ఒకరు చెప్పారు. చౌకిబల్ ప్రాంతంలోని మర్‌సెరి గ్రామంలో గల ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం సాయంత్రమే ఆ ఇంటి పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదరుకాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైన కొద్ది సేపటికి శుక్రవారం సాయంత్రమే ఒక అధికారి సహా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆ అధికారి శనివారం సాయంత్రం చెప్పారు.