జాతీయ వార్తలు

28 మంది మంత్రులతో జయ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండోసారి గెలిచిన అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సోమవారం ఉదయం 28 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై జయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన ప్రతినిధిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. గతంలో లేని విధంగా డిఎంకె అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌లకు ఆహ్వానాలు పంపారు.