జాతీయ వార్తలు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు:ప్రత్యేక జడ్జీ పదవీకాలం పొడిగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 July 2019
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.కె. యాదవ్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు నాలుగు వారాల్లో తగు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈరోజు నుంచి తొమ్మిది నెలలో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆర్.ఎఫ్ నారామన్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి పదవీకాలం పొడిగింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని ఉద్దేశ్యంతోనే న్యాయమూర్తి పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది.