జాతీయ వార్తలు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి విజయకేతనం ఎగురవేసింది. బీజీపీ ఒక్క స్థానంలో ఆధిక్యతలో ఉంది. కాగా మూడు లోకసభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో కొనసాగుతు విజయాన్ని సొంతం చేసుకోనున్నారు. మాండ్య లోకసభ అభ్యర్థి శివరామ గౌడ సమీప బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక రామనగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి గెలుపొందారు. జమఖండీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ విజయం సాధించారు. శివమొగ్గలో మాత్రమే బీజేపీ అభ్యర్థి, యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.