జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో బస చేసిన కన్నడ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. బల నిరూపణ కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసేందుకు ప్రయత్నిస్తుందని భావించి ఎమ్మెల్యేలను తమకు అనువైన ప్రదేశాలకు గోప్యంగా తరలించారు. అయితే ఎమ్మేల్యేలకు కల్పించిన భద్రతను కర్నాటక పోలీసులు ఉపసంహరించుకోవటంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని భావించారు. కాని పౌర విమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని గోప్యంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణాలోనూ, జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటల్‌లో బస చేశారు. ఈ రెండు హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటళ్లలోకి ఎవ్వరినీ అనుమతించటం లేదు. ముఖ్యమైన వారిని సైతం తనిఖీ చేసిన తరువాతే పంపుతున్నారు.