జాతీయ వార్తలు
కాశ్మీర్లో ఘర్షణలు: నలుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 August 2016
శ్రీనగర్: జమ్ము- కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య మంగళవారం జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతిచెందారు. మగమ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ వాహనంపైకి కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. హిజ్బుల్ ముజాహిదీన్ నేత బుర్హాన్వానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్లో ఆందోళనలు కొనసాగుతూ, నెల రోజులుగా మృతిచెందిన పౌరుల సంఖ్య 62కు చేరింది.