జాతీయ వార్తలు

కావేరీ జలాల సమస్యపై 2న రాష్ట్ర వ్యాప్త నిరాహార దీక్ష...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కావేరీ జలాల సమస్యపై ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్ష చేయనున్నట్టు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రకటించింది. దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా మధురైలో 120 జంటలకు ఒకే వేదిక వద్ద జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. కావేరీ జలాలపై బోర్డును ఏర్పాటు చేయడంతో కేంద్రం తత్సారం చేయడంపై ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో కావేరీ జలాలపై తమ మనోభావాన్ని తెలియచెప్పేందుకు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిరాహార దీక్ష చేపడతామన్నారు. మరోవైపు కేంద్రంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారం కేసు కూడా పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.