కడప

జగన్‌ది కిరాయి హంతకుల మనస్తత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కలెక్టరేట్)జూన్ 7: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కిరాయి హంతకులతో స్నేహం చేయడం వల్లే అతనికి కూడా నేరపూరిత మనస్తత్వం వచ్చిందని జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) విమర్శించారు. మంగళవారం జిల్లా టిడిపి కార్యాలయంలో కడప నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిచూసి ఓర్వలేకే వైఎస్ జగన్ అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, గ్రామంలో రోడ్లు వెలిశాయన్నారు. అప్పుడు ఇప్పుడు కార్మికులు, కర్షక, పేద, బలహీనవర్గాల ప్రజలకోసం చంద్రబాబునాయుడు అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి చంద్రబాబుపై అసభ్యకరమైన పదజాలాలు వాడుతున్నారన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఇలాటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటమే ఆ హోదాకే సిగ్గుచేటన్నారు. 8న జరగనున్న మహాసంకల్పదీక్ష ఒంగోలులో జరిగేందుకు నిర్ణయించినప్పటికీ జగన్ అసభ్యకరమైన ప్రవర్తన వల్ల ఈ సంకల్ప దీక్షను కడపలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి డివిజన్ నుంచి దాదాపుగా 200 మంది కార్యకర్తలు మహాసంకల్పదీక్షకు హాజరుకావాలన్నారు. తెలుగుదేశంపార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసంకల్ప దీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం తదితర టిడిపి నాయకులు ప్రసంగించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు హరిప్రసాద్, హరీంద్రనాథ్, గోవర్దన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.